AP: వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే రాష్ట్రంలో దళిత యువకుడి హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనంత బాబు ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిగా రాజమండ్రికి చెందిన ప్రముఖ న్యాయవాది మొక్కల సుబ్బరావును నియమించింది. అయితే అనంత బాబు కేసులో తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం రాష్ట్రంలో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.