కులంపై బీజేపీ ఎంపి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. ప్రధాని చేసిన పోస్టును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. రాజ్యసభలో బుధవారం ఖర్గే మాట్లాడుతూ… ‘ప్రధాని చేసిన ట్వీట్ను నేను ఖండిస్తున్నాను. ఎక్కడ మాట్లాడాలో, ఎవరిని సమర్థించాలో ప్రధాని మోడీకి తెలియాలి. అది పక్కనబెట్టి, సెంటిమెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. దీనిని పార్లమెంటులో అనుమతించకూడదు’ అని ఆయన అన్నారు.