రాజమండ్రిలో సోమవారం ఎన్డీయే కూటమి ‘విజయ శంఖారావం’ సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకే వేదికను పంచుకోనున్నారు. ప్రధాని మోడీ జగదల్పూర్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.25 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. 3 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. 4.55 గంటలకు తిరిగి అనకాపల్లి హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు.