మోపిదేవి వెంకట రమణ పార్టీ మారడం బాధాకరం: జగన్

67చూసినవారు
మోపిదేవి వెంకట రమణ పార్టీ మారడం బాధాకరం: జగన్
మాజీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ పార్టీ వీడటంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని జగన్ చెప్పారు. మోపిదేవి విషయంలో ఏనాడు తప్పు చేయలేదని, ఆయన పార్టీ మారడం బాధాకరమని అన్నారు. మండలి రద్దు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మోపిదేవిని రాజ్యసభకు పంపామని గుర్తు చేశారు. తనను జైల్లో పెట్టినా ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయ్యానని.. దేవుడు మంచివైపు ఉంటాడని జగన్ వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్