AP: ప్రస్తుత ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నెల్లూరులో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. "ఇవి ధర్మానికి-అధర్మానికి, విధ్వంసానికి-అభివృద్ధికి, బందిపోటుకు-ఐదు కోట్ల ప్రజానీకానికి మధ్య జరిగే ఎన్నిలు. రాతియుగం పోయి.. స్వర్ణయుగం రావాలి." అని చంద్రబాబు ఆకాంక్షించారు.