మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అశోక్ సద్మెక్ అలియాస్ బాలన్న సహా నలుగురు మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై రూ.28లక్షల రివార్డు ఉందని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. బాలన్న మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు 30ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. పోలీసులతో జరిగిన 32 ఎన్కౌంటర్లు, 17 దహనాలు, 34 హత్యలు, పోలీసుల కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.