వైఎస్సార్ కడప జిల్లా బీ కోడూరు మండలంలో విద్యుత్ షాక్తో తల్లీ కొడుకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎక్కడైనా వేలాడుతున్న కరెంట్ తీగలు కనబడితే అధికారులకు తక్షణమే సమాచారం అందించాలని సూచించారు.