ఏపీలోని వైయస్సార్ జిల్లా బి.కోడూరు మండలంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకున్నది. విద్యుదాఘాతంతో గుంతపల్లిలో తల్లి, కుమారుడు మృతి చెందారు. పొలానికి నీళ్లు పెడుతుండగా తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తల్లి గురమ్మ, కుమారుడు జయసుబ్బారెడ్డి మరణించినట్లు వారు గుర్తించారు.