తెలంగాణాలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిపై ఓ కసాయి కొడుకు వేటకొడవలితో దాడి చేశాడు. మెదక్ జిల్లాలో రామాయంపేట మండలం కాట్రాల గ్రామంలో తల్లి నరసమ్మ(55)పై వేటకొడవలితో కుమారుడు దినేష్ దాడికి పాల్పడ్డాడు. కుమారుడు దినేష్ చేసిన దాడిలో తల్లి నరసమ్మ చేతికి గాయమైంది. దీంతో గ్రామస్థులు దినేష్ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.