భారత వన్డే జట్టులోకి వచ్చేసిన మిస్టరీ స్పిన్నర్

70చూసినవారు
భారత వన్డే జట్టులోకి వచ్చేసిన మిస్టరీ స్పిన్నర్
భారత్ - ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాలో ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డే జట్టులో చేరాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. కాగా, ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్‌తో 14 వికెట్లు పడగొట్టి ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్