వరద బాధితులను ఆదుకునేందుకు సహకారం అందించండి: ఎమ్మెల్యే

62చూసినవారు
వరద బాధితులను ఆదుకునేందుకు సహకారం అందించండి: ఎమ్మెల్యే
భారీగా కురుస్తున్న వర్షాలకు విజయవాడలో వరదల్లో వేల మంది రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం సహాయ నిధికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వరద బాధితులను ఆదుకునేందుకు సహకారం అందించేందుకు ముందుకు రావాలని నాయకులకు బుధవారం పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ ప్రజ్ఞ విద్యాసంస్థల చైర్మన్ హేమలత రెడ్డి నరసింహారెడ్డి దంపతులు తమ వంతు సహాయంగా 40 వేల రూపాయలను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు అందజేశారు.

సంబంధిత పోస్ట్