బనగానపల్లె నియోజకవర్గం కంబగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 15వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రజల శాంతి, సమృద్ధికి ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై ఆసక్తి వ్యక్తం చేశారు. భక్తులతో మమేకమై, వారి అభిప్రాయాలను ఆలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.