పెంపుడు పావురాలకు గింజలు పెట్టడానికి మిద్దెపైకి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఈ సంఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన దూదేకుల చిన్న కుళ్లాయప్ప (68) ఇంటి మేడపై ఉన్న పావురాలకు గింజలు, నీళ్లు పెట్టడానికి వెళ్లి కాలుజారి కిందపడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.