కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు కోరారు. శనివారం జూపాడుబంగ్లా మండల కేంద్రంలో లిబరేషన్, ఏఐటీయూసీ మండల నాయకుల సమావేశం నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.