నందికొట్కూరు పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం ఉ. 10: 00 గం. లకు మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిధులు ఎమ్మెల్యే జయసూర్య హాజరై ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయనకు మున్సిపల్ అధికారులు సచివాలయ ఉద్యోగులు పుష్ప గుచ్ఛం తో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.