రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో నంద్యాల జిల్లా లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక అగ్నిమాపక కార్యాలయం, ఫైర్ ఇంజన్ వాహనం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలంధించేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ డి ఆర్ ఎఫ్ నిధులు మంజూరు అయ్యాయని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. శనివారం నందికొట్కూరు లో నూతన అగ్నిమాపక దళ కార్యాలయ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.