'రైతులకు నష్టం కలిగించే సోలార్ పనులు నిలిపివేయాలి'

63చూసినవారు
'రైతులకు నష్టం కలిగించే సోలార్ పనులు నిలిపివేయాలి'
రైతులకు నష్టం కలిగించే సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు వెంటనే నిలిపివేయాలని సీపీఎం పార్టీ జిల్లా నాయకులు పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు. శనివారం నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని పై పాలెం గ్రామంలో సిపిఎం నాయకులు తమ బృందంతో కలిసి సోలార్ ప్రాజెక్టు పనులు అడ్డుకోవడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగే వరకూ సోలార్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని లేదంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, రైతులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్