నంద్యాల రాజ్ టాకీస్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నిర్వహించిన ప్రజా దర్బార్ లో ప్రజల నుండి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వచ్చిన ప్రతి వినతిని సీరియస్ గా పరిగణనలోకి తీసుకుని, తక్షణమే పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు.