ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎగువ అహోబిలంలో శనివారం జ్వాలా నృసింహస్వామివారి కి ఘనంగా రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్లు పల్లకిపై కొలువుదీరి విహరించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం కు శాశ్వత కూరగాయల దాత మార్కెట్ ప్రసాద్ రథోత్సవం లో పాల్గొన్నారు. ఆలయ పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.