ప్యాపిలి మండలం ఎర్రమల కొండలలో వెలిసిన ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీలక్ష్మి కంబగిరి నరసింహస్వామిని పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈఓ రామకృష్ణ, అర్చకులు స్వాగతం పలికారు. వారు స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో అవుకు పట్టణ నాయకులు గూడాల మురళీధర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి , ఎస్ కొత్తూరు ప్రధాన అర్చకులు వీరయ్య స్వామి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.