కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ గా నరహరి విశ్వం

65చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ గా నరహరి విశ్వం
నంద్యాల పట్టణానికి చెందిన టిడిపి యువ నేత నరహరి విశ్వనాథరెడ్డికి కేంద్రంలో కీలకమైన ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ బైరెడ్డి శబరి సిఫార్సు మేరకు ఈ కీలకమైన పదవి లభించినట్లు శనివారం పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికలలో ఫరూక్, బైరెడ్డి శబరిల విజయం కోసం నరహరి విశ్వనాథరెడ్డి కృషి చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు నరహరి విశ్వనాథరెడ్డికి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్