కొత్తూరు సన్నిధిలో సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యేక పూజలు

56చూసినవారు
కొత్తూరు సన్నిధిలో సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యేక పూజలు
ప్రముఖ శైవక్షేత్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్. కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో విజయవాడ సీనియర్ సివిల్ జడ్జి కె. పి సాయిరాం శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో యం. రామకృష్ణ, అర్చకులు సురేష్ శర్మ, క్రిష్ణయ్య శర్మ స్వాగతం పలికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్