రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతి

73చూసినవారు
రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతి
తుగ్గలి పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో బుధవారం లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘనటలో టీడీపీ నాయకుడు సోమశేఖర్ రెడ్డి మృతి చెందాడు. బొల్లవానిపల్లికి చెందిన సోమశేఖర్ రెడ్డి (65) ద్విచక్ర వాహనంపై పత్తికొండ నుంచి స్వగ్రామానికి వస్తుండగా గుత్తి నుంచి పత్తికొండకు వెళుతున్న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలో మృతి చెందారు.

సంబంధిత పోస్ట్