ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు బందియాత్మకూర్ పీఎస్ ఎస్ఐ సిబ్బంది శనివారం గ్రామంలో బోధన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టం, శక్తి యాప్, సైబర్ నేరాలు, ఆన్లైన్ రుణ మోసాలు, డయల్ 100, 112, 1930 సేవలపై ప్రజలకు వివరాలు అందించారు. పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు.