ద్వాదశ జ్యోతిర్లింగాల్లో జరుగుతున్న ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ అమ్మవారు ప్రతిరోజు ఒక్కో దేవత మూర్తి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా ఉత్సవాలు చివరి రోజు అయిన బుధవారం భ్రమరాంబ దేవి అమ్మవారు భ్రమరాంబ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.