అవుకు మండల కేంద్రంలోని ఐటీఐలో 2వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు బుధవారం తెలిపారు. వివిధ ట్రేడ్లలో ప్రవేశానికి విద్యార్థులు జులై 24లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, 25వ తేదీన సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసుకోవాలని తెలిపారు. అనంతరం 27, 28 తేదీల్లో ప్రభుత్వ ఐటీఐలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.