చంద్రబాబు పాలనతోనే రాష్ట్రానికి మహర్దశ చేకూరనుందని రాష్ట్ర రోడ్డు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్ధన రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు పట్టణంలో గల ఎస్ ఆర్ బి సి అతిథి గృహానికి ఆయన ఇచ్చేశారు. ఈ సందర్భంగా అవుకు మండలానికి చెందిన పలువురు టిడిపి ముఖ్య నాయకులు, వివిధ శాఖల అధికారులు మంత్రి బీసీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.