మొక్కజొన్న సాగు చేసిన రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్త రామకృష్ణారావు, ఆత్మకూరు ఏ డి ఏ ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం వారు ఆత్మకూరు మండల పరిధిలోని నల్లకాలువ బాపనంతాపురం గ్రామాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంటను వారు పరిశీలించారు. ప్రస్తుతం అధిక వర్షాల వల్ల పంట కుళ్ళు తెగులకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కత్తెర పురుగు నివారణకు జాగ్రత్తలు తెలిపారు.