శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్ కు చెందిన సత్యనారాయణ అనే భక్తుడు రూ. 1.00116 విరాళం అందజేశారు. ఈ మేరకు సంబంధించిన విరాళ సొమ్మును గురువారం దేవస్థానం డొనేషన్ కౌంటర్ నందు ఆలయ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు దాతలకు ఆలయ మర్యాదలతో స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.