శ్రీశైలం అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలవాలని ఆ పార్టీ నాయకులు శనివారం లక్ష్మీ నరసింహ ఆలయంలోని బాల వీరాంజనేయ స్వామికి 101టెంకాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆ పార్టీ నాయకులు మోహన్, అశోక్, రవీంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అదేవిధంగా శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా గెలవాలని ఆకాంక్షించారు.