రాష్ట్రంలోని ఏకైక సరస్వతి ఆలయంగా పేరుగాంచిన కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి క్షేత్రంలో సరస్వతి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాతక్కాల సమయంలోనే సరస్వతి అమ్మవారికి చారుఘోషిని జలాలచే అభిషేకించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ గావించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.