గతంలో బిజెపి ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీలను నేటికి నేరవేర్చలేదని అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్ళు శివలక్ష్మి, రవణమ్మబాయి లుఅన్నారు. బుధవారం పాములపాడులో మండలంలోని అన్ని సెంటర్ల అంగన్వాడీలతో ర్యాలీగా వెల్లి తహశీల్దార్ వెంకటరమణకు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జులై 10న కోర్కెల దినోత్సవం సందర్భంగా తమ కోర్కెలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామని తెలిపారు.