AP: మంత్రి నారా లోకేశ్ త్వరలోనే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారని సమాచారం. ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ కార్యకలాపాల బాధ్యతలను లోకేశ్కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున నిర్వహించే మహానాడులో ఈ నిర్ణయం ప్రకటించే ఛాన్సుంది. కాగా, లోకేశ్ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు.