రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గుడ్న్యూస్ చెప్పారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లు పెంచుతామని వెల్లడించారు. అలాగే ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.