వైసీపీ అధినేత జగన్పై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే.. జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్లో రిలాక్స్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. పాస్ పోర్టు సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోయేవాడని తెలిపారు. బురద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారి అర్థం పర్థం లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.