నందవరం సమీపంలో వరుస ప్రమాదాలు

62చూసినవారు
నందవరం సమీపంలో వరుస ప్రమాదాలు
మర్రిపాడు మండలం నందవరం సమీపంలో సోమవారం మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయగిరి నందవరం రహదారిపై రామానాయుడు పల్లి ఎస్సీ కాలనీ సమీపంలో పందులను ఢీ కొట్టి బైక్ కింద పడింది. ప్రమాదంలో బైక్ పై ఉన్న ఒక మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. రాత్రి సమయం కావడంతో ఎదురుగా వచ్చే పందులను గుర్తించలేక ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం నందవరం సమీపంలో ట్రాక్టర్ బైకును ఢీకొట్టిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you