ఏఎస్ పేట: దేశంలో పరిస్థితులు మారడంతో ముమ్మర తనిఖీలు

61చూసినవారు
ఏఎస్ పేట: దేశంలో పరిస్థితులు మారడంతో ముమ్మర తనిఖీలు
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్ పేట ఎస్ఐ సైదులు సూచనలతో యాత్ర స్థలమైన ఏఎస్ పేటలో భక్తుల ముసుగులో సంఘవిద్రోహక శక్తులు ఎవరైనా వస్తారేమోనన్న అనుమానంతో ఏఎస్ పేటకు వచ్చే ప్రతి వాహనాన్ని స్థానిక పోలీసులు ముమ్మరంగా గురువారం తనిఖీలు చేపట్టారు. అలాగే స్థానికంగా ఉన్న లాడ్జిలలో తనిఖీలు నిర్వహించి లాడ్జిల్లో ఉన్న యాత్రికుల వివరాలు వారి ఆధార్ కార్డులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్