ఏఎస్ పేట మండలం వ్యాప్తంగా సోమవారం ఉదయం నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి చిటపట చినుకులు పడుతున్నాయి. ఈ క్రమంలో పొలాల్లో పశువులకు మేత, గడ్డి దొరుకుతుందని పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం కురవడంతో రోజు పనులకు వెళ్లే కూలీలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు.