ఎన్నికల సామగ్రిని చెత్తలో పడవేసిన ఘటన ఆత్మకూరులో మంగళవారం వెలుగు చూసింది. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం సమీపంలో చెత్తలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సామాగ్రి అయినటువంటి సీల్ వేసిన కవర్లు, స్వస్తిక్ ముద్ర, రాజ ముద్ర, సీరా తదితర వస్తువులు చెత్తలో పడవేశారు. ఈ ఘటనపై ఆత్మకూరు ఆర్డీవో భూమి రెడ్డి పావని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణకు ఆదేశించారు.