రోడ్డు ప్రమాదాలు నివారణలో భాగంగా ఆత్మకూరు సిఐ గంగాధర్ నేతృత్వంలో "రోడ్డు ప్రమాదాలు దుష్పరిణామాలు" అనే అంశంపై వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మండల స్థాయిలోని వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సీఐ గంగాధర్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు వాహనాలు నడపవద్దని సూచించారు. మీ యెక్క కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని విద్యార్థులకు సీఐ మంగళవారం తెలిపారు.