ఆత్మకూరు నియోజకవర్గం లోని 16 మంది లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 16 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు రూ. 29 లక్షలు చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా నిలుస్తున్నామని మంత్రి అన్నారు.