మర్రిపాడు: 407 పొగాకు బేళ్లు కొనుగోలు

51చూసినవారు
మర్రిపాడు: 407 పొగాకు బేళ్లు కొనుగోలు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డిసిపల్లి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం జరిగినటువంటి పొగాకు వేలంలో 147 బేళ్లను వ్యాపారులు వివిధ కారణాలతో తిరస్కరించారు. వేలం కేంద్రానికి మొత్తం 554 బేళ్లను రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. 407 బేళ్లను వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. కాగా గరిష్ట ధర కిలో రూ. 280, కనిష్ట ధర కిలో రూ. 230 కలిగింది.

సంబంధిత పోస్ట్