ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని. నిరుపేదలకు ఎల్లప్పుడూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శనివారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పేద కుటుంబం సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఆదా చేయడంతో పాటు ప్రతి నెల కొంత ఆదాయం పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు.