సంగం: ఆర్టీసీ బస్సులో పొగలు... ఆందోళన చెందిన ప్రయాణికులు

63చూసినవారు
సంగం: ఆర్టీసీ బస్సులో పొగలు... ఆందోళన చెందిన ప్రయాణికులు
నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు వద్ద ఏపీఎస్ఆర్టీసీ కి చెందిన సూపర్ లగ్జరీ బస్సులో శనివారం పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదం నుంచి తప్పించాడు. కడప నుంచి నెల్లూరుకు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు టైర్ వద్ద పొగలు వచ్చాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఈ విషయాన్ని గమనించి బస్సు డ్రైవర్ కు తెలిపారు. వెంటనే బస్సు ఆపి ప్రయాణికులను దించేశారు. మరో బస్సులో వారిని నెల్లూరు పంపించారు.

సంబంధిత పోస్ట్