చిల్లకూరు మండలంలోని 22 మంది ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమని సీపీఐ నాయకులు ప్రభాకర్, శశి కుమార్ అన్నారు. బుధవారం గూడూరు సీపీఐ ఆఫీసులో వారు విలేకరులతో మాట్లాడారు. సోషల్ ఆడిట్ పేరుతో ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా అవినీతి జరిగిందని 22 మందిని తొలగించడం అన్యాయమన్నారు. గురువారం ఆర్డీఓ దృష్టికి సమస్యను తీసుకెళతామన్నారు. ఈ సమావేశంలో నాయకులు చంద్రయ్య, రమేష్, నారాయణ పాల్గొన్నారు.