ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ను సోమవారం గూడూరు జనసేన నాయకులు నయీమ్ కలసి వినతిపత్రం అందజేశారు. గూడూరు గాంధీనగర్ సమీపంలోని టిడ్కో ఇళ్లు అధ్వాన స్థితిలో ఉండటంతో, గత ప్రభుత్వ అవినీతిని వెల్లడించారు. టిడ్కో గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు మారిపోయాయని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.