కోట మండలం వంజివాకలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి ఉత్సవంలో గూడూరు నియోజకవర్గ
శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.