కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శుక్రవారం ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసారు. వైకుంఠ ఏకాదశి విశిష్టతను ఆయన తెలియజేశారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ విష్ణుమూర్తి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ పండుగ సందర్భంగా ప్రతి కుటుంబంలో ఆనందపు వెలుగులు వెల్లువిరవాలని ఆకాంక్షించారు.