కటక్లో మే 28 నుంచి జూన్ 1 వరకు జరిగిన జాతీయ తైక్వాండో పోటీల్లో కందుకూరు క్రీడాకారులు ప్రతిభ చాటారు. లక్ష్మి అక్షరశ్రీ, లక్ష్మీప్రియ, త్రినాథ్లు బంగారు పతకాలు గెలిచారు. ఉత్తమ్, ప్రేమ్, సాత్విక్, సాయిశ్రీ వాత్సవ్లు రజత పతకాలు, మోహిత్, కేసరి నందన్లు కాంస్య పతకాలు సాధించారు. వీరిని జేసీ గోపాలకృష్ణ మంగళవారం అభినందించారు.