కందుకూరు లోని టిడిపి కార్యాలయంలో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కందుకూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 13 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1352070/- లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల పాలిట ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.